Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: వాడిన ద్విచక్ర వాహనాల విక్రయించే క్రెడ్ఆర్ సంస్థ హైదరాబాద్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. మెస్సర్స్ సబూరీ ఆటోమొబైల్స్తో జట్టుకట్టిన క్రెడ్ఆర్ సంస్థ నగరంలో సంజీవరెడ్డీ నగర్లో తన తొలి షోరూమ్ను ప్రారంభించింది. ప్రముఖ టాలీవుడ్ నటి ప్రియాంకా జవాల్కర్ ఈ షోరూమ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సబూరీ ఆటోమొబైల్స్కు చెందిన శ్రీమంత్ కుమార్, సుష్మా క్రాంతీ పాల్గొన్నారు. యూజ్డ్ బైక్స్ విభాగంలో తనకంటూ ఒక ప్రత్యేకతతో రాణిస్తున్న క్రెడ్ఆర్ సంస్థ వినియోగదారులకు నమ్మకమైన, నాణ్యమైన బైక్స్ను అందించాలనే ఉద్దేశంతో తాము ఈ స్టోర్ను ప్రారంభించినట్టుగా సబూర్ ఆటోమొబైల్స్ సంస్థ ఎండీ శ్రీమంత్ కుమార్ తెలిపారు. 120కి పైగా ఇన్స్పెక్షన్ చెక్పాయింట్స్తో 100 శాతం సర్టిఫైడ్ బైక్స్ను క్రెడ్ఆర్ ద్వారా వినియోగదారులకు అందిస్తున్నట్టుగా ఆయన వివరించారు. సంస్థ ఇప్పటికే బెంగళూరు, ఢిల్లీ, ఎన్సీఆర్, జైపూర్, పుణె, శికర్, కోటాలో తన వ్యాపారాన్ని విస్తరించి ఉందని ఆయన అన్నారు. ఇప్పుడు స్మార్ట్ సిటీగా ఎదుగుతున్న హైదరాబాద్లో సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించిందని వివరించారు. సబూరీ ఆటోమొబైల్స్ సంస్థ డైరెక్టర్ సుష్మా ఆకుల మాట్లాడుతూ ఈ ఏడాది ముగింపు నాటికి 1000 బైక్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. గరిష్టంగా వినియోగదారులకు చేరువయ్యేందుకు గాను తాము మరిన్ని షోరూమ్లను తెరవాలని యోచిస్తున్నట్టుగా తెలిపారు. క్రెడ్ఆర్లో బైక్స్ కొనుగోలు చేసిన వారికి విక్రయానంతర సర్వీసును కూడా అందించనున్నట్టుగా సుష్మా క్రాంతీ తెలిపారు. కాలేజీలకు వెళ్లేయువతతో పాటుగా సాఫ్ట్వేర్ సంస్థల్లో పని చేసే యువత హైదరాబాద్లో ఎక్కువగా ఉన్నందున రానున్న రోజుల్లో మంచి ఆదారణ లభించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.