Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 600 మంది సభ్యులతో ఘనంగా ప్రారంభం
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: హైదరాబాద్లో మెరుగైన వసతులు అందుబాటులో ఉన్నందున ఫైనాన్షియల్ టెక్నాలజీ (ఫిన్టెక్) రంగంలో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ అన్నారు. మంగళవారం ఫిన్టెక్ రంగంలో ఉన్న అంకుర సంస్థలు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమ (బీఎఫ్ఎస్ఐ) రంగాలలో మరిన్ని ఇన్నోవేషన్ టెక్నాలజీలను అందిపుచ్చుకొనేందుకు మెరుగైన ఐడియాలను పంచుకొనేందుకు గాను ఏర్పాటు చేసిన హైదరాబాద్ ఫిన్టెక్ ఫోరమ్ను (హెచ్ఎఫ్ఎఫ్) ఆయన మంగళవారం ప్రారంభించారు. భారత ఫిన్టెక్ ఫోరమ్స్ వ్యవస్థాపకుడు, బ్లాక్-చైన్ స్టాండర్డ్ కమిటీ చైర్మెన్ జె.ఎ. చౌదరీ మాట్లాడుతూ తాజా చర్యతో హైదరాబాద్లో 'ఫిన్టెక్ యూనికార్న్స్' ఏర్పాటు చేసేందుకు దోహదం చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో భాగంగా క్యూ-హబ్ హైదరాబాద్ మరియు డబ్ల్యు-హబ్ హాంకాంగ్లు ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. క్యూ-హబ్ సంస్థ అంకుర సంస్థలకు ఇన్క్యుబేటర్, కోవర్కింగ్, నెట్వర్కింగ్ ఫ్లాట్ఫారమ్గా వ్యవహరిస్తోంది. మరోవైపు డబ్ల్యు-హబ్ సంస్థ కూడా 3600 స్టార్టప్ కంపెనీలతో ఫిన్టెక్ ఇన్క్యుబేటర్గా ఆక్సిలరేటర్గా సేవలందిస్తోంది. ఈ తాజా ఒప్పందంతో ఎల్లలు దాటి ఫిన్టెక్ మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు వీలు కలుగనుంది. ముఖ్యంగా ఇండియా, చైనా, హాంకాంగ్ల మధ్య ఫిన్టెక్ల సహకారానికి ఈ ఒప్పందం దోహదం చేయనుంది. హైదారాబాద్ ఫిన్టెక్ ఫోరమ్లో (హెచ్ఎఫ్ఎఫ్) ఇప్పటికే 600 మంది ఫిన్టెక్కీలు సభ్యులుగా చేరారని నిర్వాహకులు తెలిపారు. హెచ్ఎఫ్ఎఫ్ ఇప్పటికే ఏడు స్పెషల్ ఇంటరెస్ట్ గ్రూప్స్ను (ఎస్ఐజీ) ఏర్పాటు చేసింది. బ్లాక్చైన్ టెక్నాలజీ, డేటా సైన్స్, కృత్త్రిమ మేథ, మిషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, లెడింగ్ అంశాలపై ఈ ఎస్ఐజీలను ఏర్పాటు చేశారు.