Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో పండుగల సీజన్ మొదలైన నేపథ్యంలో హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ నోకియా బ్రాండ్ కింద మరో సరికొత్త ఫోన్ను మార్కెట్లోకి తెచ్చింది. నోకియా 7.2 పేరిట దీన్ని హెచ్ఎండీ గ్లోబల్ భారత మార్కెట్లోకి గురువారం విడుదల చేసింది. ఈఫోన్ 6.3 అంగుళాల ఫుల్హెచ్డీ డిస్ప్లే హెచ్డీఆర్ 10 సపోర్ట్తో లభించనుంది. ఇందులో గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ సౌకర్యం ఉంది. ఆక్టాకోర్ 660 ప్రాసెసర్తో వస్తున్న ఈ ఫోన్లో 48,8,5 ఎంపీ సామర్థ్యపు కెమెరాలను ఏర్పాటు చేశారు. ముందు వైపు 20 ఎంపీ కెమెరాను అందిస్తున్నారు. ఈ ఫోన్లో గతంలో మాదిరిగానే జెసిస్ ఆప్టిక్స్ను వినియోగించారు. బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్-సి, ఫింగర్ ప్రింట్ సెన్సర్ వంటి సదుపాయాలతో పాటు 3,500 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ మార్కెట్లోకి విడుదలైంది. నోకియా 7.2 స్మార్ట్ఫోన్.. 4జీబీ/64జీబీ వేరియంట్ ధరను రూ.18,599గా కంపెనీ నిర్ణయించింది. 6జీబీ/64జీబీ వేరియంట్ ధరను రూ.19,599గా పేర్కొంది.