Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: జెట్ఎయిర్వేస్ వ్యవస్థాపకులు నరేశ్ గోయల్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. గోయల్పై వస్తోన్న నిధుల మళ్లింపు ఆరోపణలపై స్వతంత్ర ఆడిట్ను నిర్వహించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భావిస్తోంది. ఎస్బీఐ నిర్వహించిన ఆడిట్పై సంతృప్తిచెందని అధికారులు స్వతంత్ర ఆడిట్ నిర్వహిస్తామని ప్రకటించడంతో నరేశ్ గోయల్ మరోసారి చిక్కుల్లోపడ్డారు. మొత్తం 19 ప్రైవేటు కంపెనీలు నరేష్గోయల్కు పెట్టుబడులు ఉన్నాయని, వాటిలో ఐదు కంపెనీలు విదేశాల్లో రిజిష్టరు అయినట్లు సీనియర్ ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ సంస్థలు అమ్మకం, పంపిణీ , నిర్వహణ ఖర్చులు ముసుగులో అనుమానాస్పద లావాదేవీలున్నట్టుగా ఈడీ అనుమానిస్తూ.. దర్యాప్తు నిర్వహిస్తోంది. గతవారంలో గోయల్ను ప్రశ్నించిన అధికారులు ఎస్బీఐ నిర్వహించిన ఆడిట్లో లోపాలున్నట్లు గుర్తించారు. రుణాల సొమ్మును విదేశాల్లోని కంపెనీలకు మళ్లించారన్న ఆరోపణల నేపథ్యంలో స్వతంత్ర ఆడిట్తోనే మరిన్ని అంశాలు వెలుగులోనికి వస్తాయని ఈడీ భావిస్తోంది. ఆగస్టులో ఆయన గోయల్ నివాసాలు కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించిన తర్వాత మొదటిసారి ఆయన్ని ప్రశ్నించింది. రూ.18వేల కోట్ల మోసం చేసినట్లు ఆరోపణలపై దర్యాప్తునకు గోయల్ సహకరించడం లేదని ఆగస్టులో ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం నివేదించింది. అయితే ఈ ఆరోపణలను గోయల్ తిరస్కరించారు. కాగా దివాలా చర్యలను ఎదుర్కొంటున్న ఎయిర్లైన్స్ చైర్మన్ గోయల్ ఇదివరకే తన పదవికి రాజీనామా చేశారు.