Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీఎస్టీ తగ్గించకపోవడం నిరుత్సాహకరం
- ఇకపై మా దారిని మేమే వెతుక్కొవాలి...
- డిమాండ్ పెంచుకొనేందుకు యత్నిస్తాం
- భవిష్యత్తులో జీఎస్టీ తగ్గొచ్చు: సియామ్
న్యూఢిల్లీ: దేశంలో ఆటోమొబైల్ రంగం గతంలో ఎన్నడూ లేని విధంగా మందగమన పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ.. ఆటోమొబైల్ రంగాన్ని ఆదుకొనేందుకు సర్కారు వస్తుసేవల పన్నును (జీఎస్టీ) ఏమాత్రం తగ్గించకపోవడం పట్ల 'సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫాక్చరర్స్' (సియామ్) తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. గోవాలో సమావేశమైన జీఎస్టీ మండలి సమావేశంలో ఆటోమొబైల్ రంగంపై ప్రస్తుతం అమలులో ఉన్న 28% జీఎస్టీని 18 శాతానికి తగ్గించాలన్న ప్రతిపాదనకు సమ్మతి లభించలేదు. దీంతో వాహన రంగంపై జీఎస్టీ భారం యథాతథంగా కొనసాగనుందని సియామ్ అధ్యక్షుడు రాజన్ వధేరా అభిప్రాయపడ్డారు. ఇది పరిశ్రమకు తీరని భారమేనని ఆయన అన్నారు. శుక్రవారం నాటి పరిణామాలతో సర్కారు ఉద్దేశం తమకు అర్థమైందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో మార్కెట్లో నిలదొక్కుకొనేందుకు గాను అవసరమైన డిమాండ్ను పెంచుకొనేందుకు గాను.. ఆటోమొబైల్ రంగమే తగిన చర్యలతో ముందుకు రావాల్సి అవసరం ఉందని అన్నారు. వ్యవస్థలో డిమాండ్ పడిపోయి ఆటోమొబైల్ రంగం గతంలో ఎన్నడూ లేని విధంగా గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటుండడం. వేలల్లో కొలువులు కొండెక్కుతున్న నేపథ్యంలో వాహన రంగంపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని పరిశ్రమ వర్గాలు గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఆటోమొబైల్ విడిభాగాల పరిశ్రమ వర్గాలు కూడా 18% ఏకీకృత జీఎస్టీని అమలులోకి తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 60 శాతం ఆటోమొబైల్ విడిభాగాలపై 18 శాతం జీఎస్టీ అమలులో ఉంది. మిగతా 40 శాతం విడిభాగాలపై 28 శాతం వస్తుసేవల పన్ను అమలులో ఉంది. రానున్న పండుగల సీజన్లో వినియోగదారుల సెంటిమెంట్ మెరుగుపడగలదని వధేరా అశాభావం వ్యక్తం చేశారు. 10-13 సీటర్లతో 4 మీటర్ల వెడల్పు కలిగిన వాహనాలపై జీఎస్టీ కాంపెన్సెషన్ను జీఎస్టీ మండలి తగ్గించడాన్ని సియామ్ ఆహ్వానించింది. పరిశ్రమ వర్గాలు చాలాకాలం నుంచి ఈ డిమాండ్ చేస్తూ వస్తున్నాయని.. సర్కారు ఇప్పటికైనా తమ డిమాండ్ను పరిగణనలోకి తీసుకోని కాంపెన్సెషన్ తగ్గించడం పరిశ్రమకు అనుకూల చర్య అని ఆయన అన్నారు. సర్కారు ఇటీవల తీసుకుంటున్న చర్యలు వృద్ధికి ఊతం ఇవ్వగలవని ఆయన ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సర్కారుకు పన్ను ఆదాయం పెరిగితే రానున్న రోజుల్లో వాహన రంగంపై ఉన్న జీఎస్టీ భారాన్ని సర్కారు హేతుబద్ధీకరించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
అంతర్జాతీయ పోటీతత్వాన్ని పెంచుకోవాలి..
దేశీయ ఆటోమొబైల్ పరిశ్ర మల అమ్మకాలు తగ్గి ఇబ్బందులు పడుతుండడంపై నిటి ఆయోగ్ మాజీ వైస్చైర్మెన్ అరవింద్ పన గరియా స్పందించారు. దేశీయ పరిశ్రమలు దాదాపు 60 ఏండ్లుగా కేవలం దేశీయ మార్కెటే ధ్యేయం గా పని చేస్తూ వస్తున్నా యని అన్నారు. ఇన్ని సంవత్సరాలు గడు స్తున్నా ఆయా సంస్థలు అంతర్జాతీ య స్థాయికి తగ్గట్టుగా వాహనా లను అభివృద్ధిచేయలేక పోవడం దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు. దేశీయంగా డిమాండ్ తగ్గితే వాహన సంస్థలు విదేశీ మార్కెట్లపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. దేశీయ మార్కెట్తో పోలిస్తే విదేశీ మార్కె ట్ దాదాపు ఆరు నుంచి ఏడు రెట్టు పెద్దదని ఆయన అన్నారు. ఈ దిశగా వాహన రంగ పెద్దలు ఆలోచిస్తే బాగుంటుందని ఆయన అన్నారు. కంపెనీలు అంతర్జాతీయ పోటీతత్వాన్ని అలవరుచుకోవాలని ఆయన సూచించారు.