Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: ఉచిత ఆఫర్లతో దేశంలో టెలికాం దిగ్గజంగా ఎదిగిన రిలయన్స్ జియో సంస్థ బుధవారం జియో కీలక ప్రకటన చేసింది. ఇకపై జియో నెట్వర్క్ నుంచి ఇతర నెట్వర్క్లకు చేసే కాల్స్కు నిమిషానికి 6 పైసలు చొప్పున వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇంటర్ కనెక్ట్ యూసేజ్ ఛార్జీలను (ఐయూసీ) చార్జీల విషయంలో ట్రారు ఇచ్చిన నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ కంపెనీ తన ప్రకటనలో తెలిపింది. అయితే, వినియోగదారులు చెల్లించిన మొత్తానికి బదులుగా డేటాను తిరిగి అందివ్వనున్నామని ప్రకటించింది. ఇందుకోసం కొన్ని టాపప్ వోచర్లను ప్రకటించింది. దీనివల్ల వినియోగదారులపై అదనపు భారం పడదని జియో పేర్కొంది. అయితే, జియో సొంత నెట్వర్క్ కాల్స్కు ఎలాంటి ఛార్జీలూ వసూలు చేయబోమని ప్రకటించింది. అలాగే, ఇన్కమింగ్ కాల్స్కు, ల్యాండ్ లైన్స్ విషయంలో ఎలాంటి రుసుమూ వసూలు చేయబోమని తెలిపింది. అక్టోబర్ 10 తర్వాత రీఛార్జి చేసే వారికి ఈ ఛార్జీలు వర్తిస్తాయని పేర్కొంది. ఇప్పటి వరకు జియో యూజర్లు కాల్స్కు ఎలాంటి ఛార్జీలూ చెల్లించడం లేదు. కేవలం డేటాకు మాత్రమే చెల్లించేవారు. ఈ నేపథ్యంలో ట్రారు నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఐయూసీ ఛార్జీలను వినియోగదారుల నుంచి వసూలు చేయాలని నిర్ణయించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ 2017లో ఐయూసీ నిమిషానికి 14 పైసల నుంచి 6 పైసలకు తగ్గించింది. 2020 జనవరి 1 నుంచి పూర్తిగా రద్దు చేయాలనుకుంటోంది. అదే జరిగితే ఈ ఆరు పైసలు ఛార్జి డిసెంబరు 31 వరకే వర్తించనుంది.