Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో నగదు విస్తృతంగా అందుబాటులో ఉండేలా చేసి.. తద్వారా వినియోగం పెంచాలని భావిస్తున్న సర్కారు ఈ దిశగా దూకుడుగా ముందుకు సాగుతోంది. వ్యవస్థలో వాస్తవంగా నగదు రుణసాయం అందుబాటులో ఉన్నవారికి తాజాగా రుణాలను మంజూరుకు గాను సర్కారు 'రుణమేళా' కార్యక్రమాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బ్యాంకులు టెంట్లువేసి మరీ ఆయా పట్టణాలు, జిల్లా కేంద్రాలలో రుణాల జారీ చేస్తూ వస్తున్నారు. ఈ తరహా రుణామేళాల ద్వారా గడిచిన తొమ్ముది రోజుల్లో బ్యాంకులు రూ.81,781 కోట్ల మేర రుణాలను జారీ చేసినట్టుగా ఆర్థిక శాఖ సోమవారం ప్రకటించింది. బ్యాంకుల రుణమేళా కార్యక్రమం దేశ వ్యాప్తంగా ఈ నెల 1వ తేదీ నుంచి మొదలైన సంగతి తెలిసిందే. తొమ్మిది రోజుల్లో మంజూరు చేసిన రుణాలలో దాదాపు రూ.34,342 కోట్లు కొత్త రుణాలేనని ఆయన అన్నారు. బ్యాంకుల వద్ద సమృద్ధిగా నగదు నిల్వలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సకాలంలో అవసరం మేరకు నిధుల లభ్యత అందించేలా చూడడమే సమస్యగా మారిందని అభిప్రాయపడుతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత నెలలో రుణామేళాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. పెద్దపెద్ద కంపెనీలకు వేల కోట్లలో రుణాలను అందించే కంటే సమాజంలో చిన్నవారికి రిటైల్ రుణాలు అందించడం వల్ల ఆర్థిక వ్యవస్థకు ఎక్కువగా మేలు జరుగుతుందన్న సూత్రీకరణ మేరకు సర్కారు ఈ కార్యక్రమానికి పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. చిన్న పరిశ్రమలు నిలదొక్కుకునేందుకు గాను వనటైమ్ సెటిల్మెంట్తో పాటు కొత్త రుణాలను జారీ చేయాలని కూడా సర్కారు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో గడిచిన 9 రోజుల్లో భారీగా రుణ వితరణ జరిగినట్టుగా ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.