Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థ కష్టమే: కార్వీ
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: భారత్లో వ్యక్తిగత సంపదలో మందగమనం చోటు చేసుకుందని కార్వీ ప్రయివేటు వెల్త్ సంస్థ ఒక నివేదికలో వెల్లడించింది. గురువారం హైదరాబాద్లో 10వ ఎడిషన్ ఇండియా వెల్త్ రిపోర్టు-2019ను కార్వీ ప్రయివేటు వెల్త్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అభిజిత్ భవే విడుదల చేశారు. ఈ రిపోర్టులో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి... -2018-19 ఆర్ధిక సంవత్సరంలో భారతలో వ్యక్తిగత సంపద 9.62 శాతం మాత్రమే పెరిగి రూ.430 లక్షల కోట్లకు పరిమితమయ్యింది. అంతకు ముందు ఆర్ధిక సంవత్సరం ఇది 13.45 శాతం వృద్ధితో ముందుకు సాగింది - వ్యక్తిగత సంపదలో మందగమనం భారత జీడీపీపై ప్రభావం చూపనుంది - ద్రవ్యోల్బణం 3-4 శాతం మధ్య ఉన్నప్పటికీ జీడీపీ కేవలం 5-6 శాతానికి పరిమితం కావొచ్చు. - వచ్చే ఐదేళ్లలో వ్యక్తిగత సంపద ప్రతీ ఏడాది 13.2 శాతం పెరిగి రూ.799 లక్షల కోట్లకు చేరొచ్చని అంచనా వేసింది. - గడిచిన ఆర్థిక సంవత్సరంలో విత్త ఆస్తుల వృద్ధి 10.96 శాతానికి పడిపోయింది. ఇంతక్రితం 2017-18లో ఇది 16.42 శాతం వృద్ధిని కనబర్చింది. ఇదే సమయంలో భౌతిక ఆస్తుల విలువ 9.24 శాతం పెరగ్గా.. క్రితం ఏడాదిలో 7.59 శాతానికి మందగించాయి. -గడిచిన ఐదేండ్లలో విత్త ఆస్తుల్లో పొదుపు పెరుగుదల 57.25 శాతానికి పడిపోయింది. ఇంతక్రితం ఐదేండ్లలో ఈ విభాగం 60.95 శాతం పెరుగదలను కనబర్చింది. నోట్ల రద్దు, రెరా అమలు తర్వాత రియాల్టీ రంగం నేల చూపులు చూస్తోందన్నారు. - ప్రతీ ఏడాది రెండంకెల వృద్ధి సాధిస్తే తప్పా.. ఆర్దిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోలేదని అభిజిత్ పేర్కొన్నారు. దేశంలో వినిమయం పెరగడంతో పాటు రుణాల జారీలో వృద్ధి నమోదు కావాలన్నారు.