Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఇన్స్టాంట్ కాఫీ దిగ్గజం సీసీఎల్ ప్రొడక్ట్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్కు అరుదైన గౌరవం దక్కింది. దేశీయంగా ఇన్స్టాంట్ కాఫీ రంగంలో ఆయన అందించిన విశేష సేవలు, కాఫీ రంగం అభివృద్ధికి ఆయన చేసిన కృషికిగాను ఇంటర్నేషనల్ ఇన్స్టాంట్ కాఫీ ఆర్గనైజేషన్ ఆయనకు జీవితకాల సాఫల్య పురస్కారం (లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు) ప్రకటించింది. ఇటీవల జర్మనీలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ అవార్డు ప్రదానం చేశారు. వార్షికంగా 1,500 టన్నుల సామర్థ్యంతో ప్రారంభమైన సీసీఎల్ ప్రస్థానం నేడు 35,000 టన్నుల స్థాయికి చేరింది. దీనికి తోడు కాఫీ రంగానికి దేశీయంగా ఒక సుస్థిరత తేవడంతో పాటు వివిధ వర్గాల వారికి కాఫీని చేరువ చేయడంతో సీసీఎల్ వినూత్న చర్యలను చేపడుతూ ముందుకు సాగింది. ఇందులో చల్లా పాత్ర విశేషంగా ఉంది. 90కి పైగా దేశాల్లోని క్లయింట్లకు చల్లా కంపెనీ కాఫీ ఉత్పత్తులను సరఫరా చేస్తోంది.