Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: మాజీ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) కేవీ చౌదరి రిలయన్స్ ఇండిస్టీస్లో స్వతంత్ర డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. 1978 ఇండియన్ రెవె న్యూ సర్వీసెస్ బ్యాచ్కు చెందిన చౌదరి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుకు (సీబీడీటీ) చైర్మన్గా కూడా వ్యవహరిం చారు. ఆయన 2015 నుంచి 2019 జూన్ వరకు సీవీసీగా బాధ్యతలు నిర్వహించారు. సీబీడీటీ ఇన్కమ్ట్యాక్స్తో సహా పలు కీలక పన్నులకు సంబందించిన కీలక నిర్ణయాలు తీసుకొంటుంది. చౌదరి పదవీ విరమణ చేశాక రెవెన్యూ శాఖకు సలహాదారుగా వ్యవహరించారు. నల్లధనంపై తీసుకోవాల్సిన చర్యలపై ఆయన పలు సూచనలు చేశారు. ఆయన నియామక సమాచారాన్ని రిలయన్స్ రెగ్యూలేటరీకి సమర్పించిన ఫైలింగ్లో వెల్లడించింది. చౌదరిని నాన్- ఎగ్జిక్యూటీవ్ అడిషనల్ డైరెక్టర్గా నియమించడానికి శుక్రవారం జరిగిన బోర్డుమీటింగ్లో డైరెక్టర్లు ఆమోదముద్ర వేసినట్లు వెల్లడించింది. ''చౌదరీ బాధ్యతలు కంపెనీలోని ఏ డైరెక్టర్కు అనుబంధంగా ఉండవు'' అని రిలయన్స్ పేర్కొం ది. విజిలెన్స్తో సహా ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మెన్గా పన్ను వ్యవస్థల్లోని లోటుపాట్లపై పూర్తి అవగాహన ఉన్న చౌదరిని బోర్డు సభ్యునిగా నియమించుకోవడం వెనుక రిలయన్స్ సంస్థ వాస్తవ ఉద్దేశం ఏమై ఉంటుందన్న చర్చ ఆర్థిక వర్గా ల్లో ఇప్పటికే మొదలై ఉంది. ఆయన సేవలను ఉపయోగిం చుకొన్ని సంస్థ పన్నుభారాన్ని తగ్గించుకోవడమనేది ఒక అంతరార్థంగా ఉండోచ్చని వారంటున్నారు. తన సర్వీసులో నిక్కచ్చిగా వ్యవహరించి సీవీసీ పదవికి వన్నెతెచ్చేందుకు పాటుపడిన చౌదరి.. కార్పొరెట్ దిగ్గజం రిలయన్స్లో చేరడం ఊహించలేని పరిణామనని వారు చెబుతున్నారు.