Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: సంక్షోభంలో ఉన్న పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరే టివ్ (పీఎంసీ) బ్యాంక్ డిపాజిటర్లు రోజురోజుకు తమ ఆందో ళనలను తీవ్రతరం చేసున్నారు. ఇటీవలే తమ డిపాజిట్లకు రక్షణ కల్పిం చాలని.. తమను ఆదుకో వాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను అడ్డుకున్న డిపాజిటర్లు శనివారం దక్షిణ ముంబయిలోని భారతీర రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ప్రధాన కార్యాలయం ఎదుట శనివారం భారీ ఆందోళనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆర్బీఐ పనితీరును, పీఎంసీ బ్యాంక్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పీఎంసీ బ్యాంకులో తాము దాచుకున్నమొత్తం డబ్బును వాపస్ ఇచ్చేయాలని డిపాజిటర్లు ఆందోళనకు దిగారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అక్కడ భద్రతా ఏర్పాట్లు చేశారు. పీఎంసీ బ్యాంకులో రూ.4,355 కోట్ల అవకతవకలు జరిగినట్లు వెలుగులోకి రావడంతో గత నెలలో ఆర్బీఐ రంగంలోకి దిగిన సంగతి తెలిసింది. దీనిలో ఉన్న డిపాజిటర్లు తమ ఖాతాల నుంచి రూ.1000 మించి విత్డ్రా చేయడానికి వీలు లేకుండా నిబంధన విధించింది. ఆ తర్వాత నిబంధనలను సడలిస్తూ విత్డ్రా పరిధిని రూ.40,000కు పెంచింది. దీనికి తోడు బ్యాంక్పై ఆర్బీఐ ప్రాప్ట్ కరెక్షన్ ఆంక్షలు కూడా విధించిన సంగతి తెలిసిందే. దీంతో బ్యాంక్ కార్యకలాపాలు భారీగా ప్రభావితం అవుతున్నాయి. ఇంతా జరుగుతున్నా బ్యాంక్లో వాస్తవంగా ఏం జరుగుతుందన్న విషయంపై అటు ఆర్బీఐ గానీ.. ఇటు ప్రభుత్వ గానీ స్పష్టతనివ్వకపోవడంపై డిపాజిటర్లు తీవ్ర అందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంక్ ప్రస్తుత పరిస్థితికి కారకులపై తీవ్ర చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.