Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్మాణాల్లో జాప్యంతో భారీగా పెరిగిన అంచనా వ్యయం
న్యూఢిల్లీ : మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణాల్లో జాప్యం నెలకొనడంతో వాటి అంచనా వ్యయాలు కనీవినీ ఎరుగని రీతిలో పెరిగాయి. ఈ అదనపు భారం 360 ప్రాజెక్టులకు దాదాపు రూ. 3.88 లక్షల కోట్లకు చేరింది. అంచనా వ్యయం రూ. 150 కోట్లకు మించిన ప్రాజెక్టులను స్టాటిస్టిక్స్ అండ్ ప్రొగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మినిస్ట్రీ పర్యవేక్షిస్తుంది. ఈ శాఖ ప్రకారం.. మొత్తం 1,608 ప్రాజెక్టుల్లో 360 ప్రాజెక్టుల అంచనా వ్యయాలు 550 రెట్లు పెరిగాయి. 1,608 ప్రాజెక్టుల వాస్తవ వ్యయం రూ. 19,17,796.07 కోట్లుండగా.. నేడు వాటి నిర్మాణాల పూర్తికి అంచనా వ్యయం రూ. 23,05,860.33 కోట్లకు పెరిగింది. అంటే నిర్మాణాల్లో జాప్యం నెలకొన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అదనంగా రూ. 3,88,064.26 కోట్ల భారం పడుతున్నది. నిర్మాణ పనుల్లో ఆలస్యమైన మొత్తం 550 ప్రాజెక్టుల్లో 182 ప్రాజెక్టుల నిర్మాణాల్లో గరిష్టంగా 12 నెలల జాప్యం, 119 ప్రాజెక్టుల్లో గరిష్టంగా 24 నెలలు, 116 ప్రాజెక్టుల్లో కనిష్టంగా 61 నెలల జాప్యం నెలకొంది. మొత్తంగా 550 ప్రాజెక్టుల నిర్మాణాలకు సగటున 39.24 నెలల జాప్యం నెలకొన్నట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.