Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశీయ ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ సంస్థలో కొత్త వివాదం వెలుగులోకి వచ్చింది. కంపెనీ రాబడి, లాభాలని అధికంగా చూపేందుకు ఉన్నతాధికారులు అడ్డదారులు తొక్కుతున్నారన్న ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్, సీఎఫ్వో నిలంజన్పై కొందరు ఉద్యోగులు (విజిల్ బ్లోయర్స్) తీవ్ర ఆరోపణలు చేశారు. చాలా త్రైమాసికాల నుంచి తక్కువ సమయంలో ఆదాయం, లాభాల కోసం కంపెనీ అనైతిక విధానాలను ఆచరిస్తుందని వారు ఆరోపించారు. 'ఎథికల్ ఎంప్లాయిస్' పేరుతో ఏర్పడిన ఉద్యోగుల బృందం ఈ మేరకు ఇన్ఫోసిస్ డైరెక్టర్ల బోర్డుకు, అలాగే అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజీ కమిషన్కు (ఎస్ఈసీ) ఈ విషయమై ఫిర్యాదు చేసింది. ఆడిటర్లను ఆయా లావాదేవాలకు సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించాలని, మార్జిన్లు, అప్రకటిత ముందస్తు కమిట్మెంట్లు, రాబడికి సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలనీ కోరింది. ఈ ఫిర్యాదును కంపెనీ విధానం ప్రకారం ఆడిట్ కమిటీ ముందు ఉంచామనీ, పాలసీకి అనుగుణంగా దీనిపై విచారణ ఉంటుందని ఇన్ఫోసిస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ క్వార్టర్(త్రైమాసికం)లో ఎఫ్డిఆర్ కాంట్రాక్టులో 50 మిలియన్ డాలర్ల ముందస్తు చెల్లింపు రివర్సల్లను గుర్తించవద్దని చాలా ఒత్తిడి తెచ్చారని, ఇది అకౌంటింగ్ ప్రాక్టీస్కు విరుద్ధమని, ఇది త్రైమాసికంలో లాభాలను తగ్గిస్తుందని, స్టాక్ ధరకు ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఇన్ఫోసిస్ సీఈవో, సీఎఫ్వో ఒత్తిడి చేస్తున్నారని సెప్టెంబర్-20, 2019న బోర్డుకి రాసిన లేఖలో వారు ఆరోపించారు. పెద్ద కాంట్రాక్టులలో ఆదాయ గుర్తింపు విషయాలు అకౌంటింగ్ ప్రమాణాల ప్రకారం లేవని, దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, విచారణ అధికారులు తమను అడిగినప్పుడు వీటిని సమర్పిస్తామని విజిల్ బ్లోయర్స్ తెలిపారు.