Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారాంతంలో మదుపరులకు కుదుపు
ముంబయి: దేశీయ స్టాక్మార్కెట్లు వారాంతంలో భారీ నష్టాలబాటలో నడిచాయి. ప్రారంభంలోనే బలహీనంగా ఉన్నప్పటికీ ఆఖరి గంటలో అమ్మకాల ఫర్యాలేదనిపించాయి. ప్రధా నంగా ఆర్థిక వ్యవస్థకు ప్రముఖ రేటింగ్ సంస్థ మూ డీస్ ఇచ్చిన డౌన్ గ్రేడ్ రేటింగ్ షాక్ తగిలింది. ఆర్థిక వ్యవస్థలో మందగమనం మరింత కొనసాగు తుందంటూ, భారతదేశ రేటింగ్ను స్థిరం నుంచి ప్రతికూలంగా మార్చడంతో కీలక సూచీలు రెండూ భారీ నష్టాలను చవిచూశాయి. ఒకానొక దశలో 380 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ 40300 పాయింట్ల స్థాయి, నిఫ్టీ 11900 స్థాయి దిగువకు చేరాయి. చివరకు సెన్సెక్స్ 330 పాయిం ట్లు కుప్పకూలి 40323 వద్ద, నిఫ్టీ 104 పాయింట్లు కోల్పోయి 11908 వద్ద స్థిరపడ్డాయి. తద్వారా కీలక మద్దతు స్థాయిలను నిలబెట్టుకో వటం విశేషం. శుక్రవారం దాదాపు అన్ని రంగాలు నష్టపోయాయి. ప్రధానంగా రియల్టీ, ప్రయివేట్ బ్యాంక్స్, మీడియా స్వల్పంగా లాభపడగా, ఫార్మా , ఐటీ,ఎఫ్ఎంసీజీ నష్టపోయాయి. భారతి ఇన్ఫ్రా టెల్, సన్ఫార్మా, గెయిల్, యూపీఎల్, వేదాంతా, హెచ్యూఎల్, టీసీఎస్, సిప్లా, ఐటీసీ టాప్ లూజర్స్గా నిలవగా, యస్ బ్యాంకు , ఇండస్ ఇం డ్, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్ర, హెచ్సీఎల్ కంపెనీలు లాభపడ్డాయి