Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో నెలకొన్న ప్రతికూల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో భారత వృద్ధి మరింతగా దిగాజారే అవకాశం ఉందని ఎస్బీఈ తన తాజా నివేదికలో పేర్కొంది. వాహన అమ్మకాలు పడిపోవడం, విమానయానం తగ్గడం, కీలక రంగాల వృద్ధి గణనీయంగా క్షీణించడంతో పాటు కొత్త పెట్టుబడులు భారీగా పడిపోత్ను వేళ దేశ వృద్ధి రేటు 4.2 శాతానికే పరిమితం కావొచ్చని ఎస్బీఐ తన నివేదికలో పేర్కొంది. ఇదే పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను కూడా ఎస్బీఐ భారీగా తగ్గించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి 5 శాతానికే పరిమితం కావొచ్చని పేర్కొంది. అంతకు ముందు ఎస్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాను 6.1 శాతంగా లెక్కగ ట్టింది. దీంతో భారతీయ స్టేట్ బ్యాంక్ అసియా అభివృద్ధి బ్యాంక్, ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్, ఓఈసీడీ, ఆర్బీఐల తరువాత భారత వృద్ధిరేటు తగ్గించిన విత్త సంస్థగా నిలిచింది. భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 5 శాతం వృద్ధిని నమో దు చేసిన సంగతి తెలిసిందే. ఇది దాదాపు ఆరేండ్ల కని ష్టం కావడం గమనార్హం. దేశంలో ఈ ఏడాది విస్తారంగా వర్షాలు పడినప్పటికీ అవి వ్యవసాయోత్పత్తిని పెంచేందుకు అనువుగా ఉండకపోవడం కూడా ఆర్థిక వ్యవస్థకు కొంత ప్రతికూల అంశమేనని ఎస్బీఐ తెలిపింది. ప్రధానంగా వ్యవసాయా ధారిత రాష్ట్రాలలో ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశాలు లేకపోవడంతో వృద్ధి రేటు మరింతగా పడిపోయే సూచనలు కనిపిస్తున్నట్టుగా నివేదిక తెలిపింది. ఆర్థిక వ్యవస్థ విశ్లేషణకు ప్రముఖంగా నిలిచే 33 సూచీలు రెండో త్రైమాసికంలో 85 శాతం మేర వేగంగాతో పురోగమనాన్ని నమోదు చేశాయని అయినా ఆర్థిక వ్యవస్థలో మందగమన పరిస్థితులను అధిగమించి మేటి వృద్ధిని నమోదు చేసేందుకు ఇది సరిపోదని ఎస్బీఐ తన ఎకోవ్రాప్ నివేదికలో పేర్కొంది. ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించేందుకు గాన కేంద్రంలో మోడీ సర్కారు పలు ఉద్దీపన పథకాలను రాయితీల రూపంలో ప్రకటిస్తున్నప్పటికీ ఈ ఏడాది వృద్ధి రేటు తగ్గే అవకాశం ఉందని ఎస్బీఐ విశ్లేషించడం ఆందోళకర పరిణామం.