Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీగా పెరిగిన పప్పులు, కూరగాయల ధరలు
- దాదాపు 16 నెలల గరిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: దేశంలో ధరలు భగ్గుమంటున్నాయి. ప్రతికూల పరిస్థితలు నేపథ్యంలో పంట ఉత్పత్తుల సప్లయి తగ్గడంతో గత అక్టోబరు మాసంలో రిటైల్ ద్రవ్యల్బోణం 4.62 శాతానికి చేరింది. ఇది భారతీయ రిజర్వు బ్యాంక్ నిర్ణయించుకున్న గరిష్టావధి 4 శాతం కంటే అధికం కావడం విశేషం. జులై 2018 తరువాత రిటైల్ ద్రవ్యోల్బణం ఈ స్థాయికి చేరడం ఇదే ప్రథమమని సర్కారు గణాంకాలు చెబుతున్నాయి. ఆహారానికి ఉపయోగించే ఉత్పత్తుల ధరలు గణనీయంగా పెరగడం వల్లే రిటైల్ ద్రవ్యోల్బణం 16 నెలల గరిష్టానికి చేరినట్టుగా విశ్లేషణలు చెబుతున్నాయి. ఆక్టోబరు నాటికి శీతాకాలం సీజన్ పంటల సప్లయి మార్కెట్లోకి రావడం ద్వారా ధరలకు కళ్లెం పడుతుందని ఆర్బీఐ తొలత భావించింది. అయితే అందుకు భిన్నమైన పరిస్థితులు ఎదురవడంతో దేశంలో అన్ని రకాల ధరలు భగ్గుమంటున్నాయి. అంతకు ముందు సెప్టెంబరు మాసంలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.99 శాతంగా ఉంది. ఈ ఏడాది అక్టోబరులో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని పరిశీలిస్తే గతేడాదికంటే ఎక్కువగా నమోదు కావడం విశేషం. గతేడాది అక్టోబరు మాసంలో రిటైల్ ద్రవ్యోల్బణ 3.38 శాతంగా నిలిచింది. వినియోగదారు ఆహారానికి వినియోగించే వాటి ధరల ద్రవ్యోల్బణం గత అక్టోబరు మాసంలో 7.89% మేర పెరిగింది. అంతకు ముందు మాసంలో ఈ రంగంలో వృద్ధి 5.1 శాతంగానే నిలిచింది. ఆక్టోబరు మాసంలో ముఖ్యంగా పప్పు ధాన్యాల ధరలు 8.4 శాతం నుంచి 11.72 శాతానికి , కూరగాయల ధరలు 11.4 శాతం నుంచి 26 శాతం పెరగడం విశేషం. గత అక్టోబరు మాసంలో గ్రామీణ ప్రాంతపు ద్రవ్యోల్బణం 4.29 శాతంగా నిలిచింది. పట్టణ ప్రాంతాల్లో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో అర్బన్ ఫుడ్ ఇన్ప్లెషన్ 10.47 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 5.11 శాతంగా నిలిచింది. ధరల నియంత్రణ దిశగా సర్కారు తగిన చర్యలు తీసుకోకపోవడం కూడా ప్రస్తుత పరిస్థితికి కారణమని విశ్లేషకులు. అభిప్రాయపడుతున్నారు.