Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: లెనోవోకు చెందిన మోటోరొలా సంస్థ తన సరికొత్త ఫోల్డబుల్ ఫోన్ను మార్కెట్లోకి ఆవిష్కరించింది. ఫోల్డబుల్ ఫోన్ను 'రేజర్ (2019)'గా దీనిని మార్కెట్లోకి తెచ్చింది. ఈ మడత ఫోన్లో 6.2 అంగుళాల స్క్రీన్తో పాటు ముందువైపు సెకండరీ స్క్రీన్ను ఉంచారు. ఈ ఫోన్ను వచ్చే ఏడాది జనవరి 9 నుంచి అమ్మకానికి రానుంది. డిసెంబర్ 26 నుంచి ప్రీ ఆర్డర్స్ ప్రారంభం కానున్నాయి. ఈ ఫోన్ ధరను కంపెనీ 1,499.99 డాలర్లుగా కంపెనీ నిర్ణయించింది. అంటే భారత కరెన్సీ ప్రకారం 1.07 లక్షలన్న మాట. ఇండియాలో ఆవిష్కరించే సమయానికి దీని ధరను ఎంతగా నిర్ణయిస్తారనేది ఇంకా వెల్లడి కాలేదు. ఇందలు 6.2 అంగుళాల ఫ్లెక్సీ ఓఎల్ఈడీ హెచ్డీ డిస్ప్లేను అమర్చారు. దీన్ని సగానికి మడుచుకోవచ్చు. ఫోన్ తెరిచేటప్పుడు స్క్రీన్ మధ్య ఎలాంటి ఖాళీ లేకుండా కంపెనీ జాగ్రత్త తీసుకుంది. దీంతో పాటు ముందు వైపు 2.7 అంగుళాల క్విక్ వ్యూ డిస్ప్లేను అమర్చారు. దీని ద్వారా ఫోన్ను తెరవకుండనే నోటిఫికేషన్స్ను మ్యూజిక్ కంట్రోల్ చేయొచ్చు. ఇందులో 16 ఎంపీ కెమెరాను వినియోగించారు. ఫోన్ను ఫోల్డ్ చేసినప్పుడు దీన్నే సెల్ఫీ కెమెరాగా వినియోగించుకోవచ్చు. దీని ద్వారా రాత్రివేళ్లలో కూడా అద్భుతమైన చిత్రాలు తీయొచ్చని కంపెనీ చెబుతోంది. డిస్ప్లే నాచ్లో 5 ఎంపీ కెమెరాను వినియోగించారు. అన్ఫోల్డ్ చేసినప్పుడు సెల్ఫీ కెమెరాగా ఇది ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 9 పై ఓఎస్తో పనిచేస్తుంది. ఫోన్ ముందుభాగంలో ఫింగర్ప్రింట్ సెన్సర్ను అమర్చారు. యూఎస్బీ టైప్-సి పోర్ట్, స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ వస్తున్న ఈ ఫోన్లో 6జీబీ ర్యామ్, 2510 బ్యాటరీని వినియోగించారు. ఎన్ఎఫ్సీ, బ్లూటూత్ 5.0 వంటి సదుపాయాలు ఉన్నాయి.