Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందుకే నివేదికను వెల్లడించలేదు: సర్కారు
న్యూఢిల్లీ: దేశంలోని ప్రజల నెలవారీ తలసరి వ్యయం పడిపోయిందంటూ ప్రభుత్వ ఆధీనంలోని ''జాతీయ గణాంకాల కార్యాలయం'' (ఎన్ఎస్వో) నివేదిక తేల్చిన విషయమై ప్రభుత్వం శనివారం వివరణనిచ్చింది. ఇ ఎన్ఎస్వో అధికారికంగా బయటకు వెల్లడించని సర్వే నివేదికను ఉటంకిస్తూ పలు వార్తా ప్రతికలు దేశంలో ప్రజల తలసరి వ్యయం తగ్గుతూ వస్తోందంటూ శనివారం కథనాలను ప్రచురించిన విషయం తెలిసిందే. దీనికి తోడు గ్రామీణ భారతంలో వ్యయం గణనీయంగా తగ్గిందని ప్రజలు ఆహారంపై ఖర్చు చేస్తున్న మొత్తంలో కూడా తగ్గుదల కనిపిస్తోందంటూ ఎన్ఎస్వో సర్వే నివేదిక తేల్చింది. ఇదే అంశాన్ని వార్తా ప్రతికలు పతాక స్థాయిలో ప్రచురించడంతో మోడీ సర్కారు షాక్తింది. వెంటనే నష్టనివారణ చర్యలను ప్రారంభించింది. ఎన్ఎస్వో నిర్వహించిన సర్వేలోని సమాచార నాణ్యత విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయని సర్కారు తెలిపింది. అందవల్లనే తాము ఈ నివేదికన బయటకు వెల్లడించలేదని ప్రభుత్వ గణాంకాలు పథకాల అమలు శాఖ శనివారం ఒక వివరణాత్మక పత్రికా ప్రకనటనను విడుదల చేసింది. సమాచారానికి సంబంధించిన అన్ని నాణ్యతా ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటూ 2020-21లో తాము కన్జూమర్ ఎక్స్పెండీచర్ సర్వేను రూపొందించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.