Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణి జ్య విభాగం: ప్రస్తు తం దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో 'ది ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ కాంప్లెక్స్ ఛాయిసెస్' (ఐఏఎస్సీసీ) హైదరాబాద్లో కీలక ఆర్థిక సదస్సును నిర్వహించనుంది. ఎక్స్ఎల్ఆర్ఐ ఝంషెడ్పూర్ వారి భాగస్వామ్యంతో ఐఏఎస్సీసీ ఈనెల 19, 20 తేదీల్లో ఈ సదస్సును నిర్వహించనుంది. ''గ్రోత్ ప్యారడాక్స్: రుణ నేతృత్వంలోని వృద్ధికంటే గృహ సంపాదన నేపథ్యంలోని వృద్ధి మేలు'' అనే చర్చాంశంతో ఈ ఆర్థిక సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సులో వివిధ రంగాలకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్తలు, వ్యాపారవేత్తలు, వివిధ ఆర్థిక విశ్వవిద్యాలయాలకు చెందిన ఫ్రొఫెసర్లు పాల్గొననున్నట్టుగా ఐఏఎస్సీసీ సహ వ్యవస్థాపకుడు ఫ్రొపెసర్ అనిల్ సూద్ తెలిపారు. వృద్ధి అవకాశాలను సృష్టించడానికి అందుబాటులో ఉన్న ఎంపికలు, వినియోగం పెంపు అంశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న మందగమన పరిస్థితుల్లో భారత్ మరియు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న పొదుపు మరియు పెట్టుబడి అవకాశాలను గురించి కూడా ఈ సదస్సులో చర్చించనున్నారు. ఈ సదస్సులో ఆర్బీఐ మాజీ గవర్నర్ డాక్టర్ వై.వి.రెడ్డితో పాటు దాదాపు 60కి పైగా ఆర్థికవేత్తలు పాలుపంచుకోనున్నట్టుగా సూద్ తెలిపారు.