Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోర్డుకు స్వతంత్ర డైరెక్టర్ రాజీనామా
న్యూఢిల్లీ: యెస్ బ్యాంక్లో అంతర్గత క్రమశిక్షణ విలువలు దిగజా రిపోతున్నాయంటూ స్వతం త్ర డైరెక్టర్ ఉత్తమ్ ప్రకాష్ అగర్వాల్ తాజాగా బాంబు పేల్చారు. ఈ విషయమై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ తన పదవికిరాజీనామా సమర్పించారు. ''యెస్ బ్యాంకు ఇండిపెండెంట్ డైరెక్టర్, ఆడిట్ కమిటీ చైర్మెన్ పదవులతో పాటు, బోర్డుకు సంబంధించిన అన్ని కమిటీల్లో సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేస్తున్నా'' అంటూ ఆయన బ్యాంకు తాత్కాలిక చైర్మెన్ బ్రV్ా్మదత్కు పంపిన ఒక లేఖలో తెలిపారు. బ్యాంక్లో కార్పొరేట్ పాలనా ప్రమాణాలు క్షీణిస్తున్నాయని, నిబంధనల అమలులో వైఫల్యం, యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలు.. ముఖ్యంగా బ్యాంకు ఎండీ, సీఈవో రవనీత్ గిల్, సీనియర్ గ్రూపు ప్రెసిడెంట్ రాజీవ్ ఉబోరు, లీగల్ హెడ్ సంజరు నంబియార్ బ్యాంకును నిర్వహిస్తున్న తీరు పట్ల ఆయన తన లేఖలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ''యెస్ బ్యాంకు, లక్షలాది డిపాజిటర్లు, వాటాదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ కీలక అంశాల పట్ల ఎప్పటికప్పుడు ఆందోళనలు వ్యక్తం చేశాను. నా విధుల నిర్వహణలో వీటి పరిష్కారానికి శాయశక్తులా ప్రయత్నించా. నా రాజీనామాతో సంబంధం లేకుండా, బ్యాంకు కుదుటపడి, భాగస్వాములు, వాటాదారుల ప్రయోజనాలను మీ నాయకత్వంలో కాపాడుతుందని ఆశిస్తున్నాను'' అని అగర్వాల్ పేర్కొన్నారు.