Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యూ3లో రూ.8,118 కోట్ల లాభాలు..
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)ప్రతీ రూ.1 విలువ కలిగిన షేర్పై రూ.5 డివిడెండ్ను అందించడానికి కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు శుక్రవారం ఆమోదం తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది మూడో మధ్యంతర డివిడెండ్. దీన్ని జనవరి 31న ఈక్విటీ షేర్హోల్డర్లకు అందించనుంది. ఇందుకు జనవరి 25ను రికార్డు తేదీగా తీసుకోనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో 0.2 శాతం పెరుగుదలతో రూ.8,118 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇదే సమయంలో కంపెనీ రెవెన్యూ 6.7 శాతం పెరిగి రూ.39,854 కోట్లుగా నమోదయ్యింది.