Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికాను దాటేసి మెరుగైన షిప్మెంట్లు
- మార్కెట్ వాటాలో శాంసంగ్ను వెనక్కినెట్టిన వివో
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ విపణిలో భారత్ దూసుకుపోతోంది. భారత్ తాజాగా చైనా తర్వాత ప్రపంచంలోనే రెండో అతి పెద్ద స్మార్ట్ఫోన్ మార్కె ట్గా అవత రించిందని ''కౌంటర్ పాయింట్ రీసర్చ్'' సంస్థ తన తాజా నివేదికలో పేర్కొంది. 2019లో భారత్లో 15.8 కోట్ల స్మార్ట్ఫోన్ ఎగుమతులు, దిగుమతులు జరిగాయని ఈ నివేదిక తెలిపింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు 7శాతం అధికం. భారత్ రెండో స్థానానికి చేరుకోవడంతో అమెరికా ఈ జాబితాలో మూడో స్థానానికి పడిపోయింది. మరోవైపు భారత స్మార్ట్ఫోన్ విపణిలో చైనా బ్రాండ్ ఉత్పత్తులు మరోసారి తమ సత్తాను చాటాయి. 2019లో అమ్ముడైన మొత్తం ఫోన్లలో చైనా బ్రాండ్ల వాటా రికార్డు స్థాయిలో 72 శాతానికి చేరింది. అంతకుముందు ఏడాది ఇది 60 శాతంగా ఉండేది. చైనా దిగ్గజం షావోమీ 28శాతం మార్కెట్ షేర్తో మరోసారి అగ్రస్థానం దక్కించుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో శాంసంగ్ (21శాతం), వివో (16శాతం), రియల్మీ (10శాతం), ఒప్పో (9శాతం) నిలిచాయి. డిసెంబరుతో ముగిసిన నాలుగో త్రైమాసికంలో చైనా సంస్థ వివో మెరుగైన పనితీరును కనబరిచింది. తొలిసారిగా శాంసంగ్ను దాటేసి రెండో స్థానం దక్కించుకుంది. నాలుగో త్రైమాసికంలో అమ్ముడైన మొత్తం స్మార్ట్ఫోన్లలో వివో మార్కెట్ వాటా 21శాతం ఉండగా.. శాంసంగ్ వాటా 19శాతానికి పడిపోయింది. 27శాతం వాటాతో షావోమీ తొలి స్థానంలో కొనసాగినట్లు కౌంటర్పాయింట్ రీసర్చ్ తన నివేదికలో పేర్కొంది. అయితే రానున్న రోజులో భారత్ దూకుడు మరింతగా పెరిగే అవకాశం ఉందని ఈ నివేదిక తెలిపింది.