Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెన్సెక్స్ 106 పాయింట్ల తగ్గుదల
ముంబయి : దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పడిపోతున్న పారిశ్రామికోత్పత్తి భారత మార్కెట్లను ఒత్తిడికి గురి చేశాయి. మరోవైపు కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా మతుల సంఖ్య పెరగుతుండటంతో మదుపర్లు ఆందోళనకు గురైయ్యారు. ఈ నేపథ్యంలోనే గురువారం బీఎస్ఈ సెన్సెక్స్ 106 పాయింట్లు క్షీణించి 41,460కు పడిపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 27 పాయింట్లు తగ్గి 12,175 వద్ద ముగిసింది.
అమ్మకాల ఒత్తిడితో ఇంట్రా ట్రేడింగ్లో సెన్సెక్స్ 41,338, నిఫ్టీ 12226 కనిష్ట స్థాయిలను తాకాయి. జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 7.59 శాతానికి ఎగియడానికి తోడు డిమాండ్ లేక గతేడాది డిసెంబర్లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ ప్రతికూలతలో ఏకంగా మైనస్ 0.3 శాతానికి పడిపోయింది.
ఈ రెండు పరిణామాలు మదుపర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాయని బ్రోకర్లు పేర్కొన్నారు. అంతర్జాతీయంగా అమెరికా సూచీల ఫ్యూచర్స్ నీరసించగా.. ఆసియాలోనూ అమ్మకాలు పెరిగాయి. నిఫ్టీలో బ్యాంకింగ్ రంగం 0.83 శాతం, లోహ 0.62 శాతం, రియాల్టీ 0.44 శాతం చొప్పున ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్-30లో 16 స్టాక్స్ నష్టపోగా.. 14 సూచీలు లాభపడ్డాయి. టైటన్ , ఎస్బీఐ, ఇన్ఫోసిస్, హెచ్యుఎల్, సన్ ఫార్మా సూచీలు గరిష్టంగా 2.31 శాతం వరకు లాభపడ్డాయి. మరోవైపు ఇండుస్ఇండ్ బ్యాంకు, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంకు, ఎన్టీపీసీ, కొటాక్ బ్యాంకు సూచీలు అత్యధికంగా 3.54 శాతం వరకు నష్టపోయిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి.