Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నయ్ : ప్రయివేటు రంగంలోని లక్ష్మీ విలాస్ బ్యాంకు (ఎల్విబి) 2019 అక్టోబర్-డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో రూ.334.47 కోట్ల నికర నష్టాలు చవి చూసింది. తమిళనాడు కేంద్రంగా పని చేస్తోన్న ఈ బ్యాంకు 2018 ఇదే త్రైమాసికంలో రూ.373.48 కోట్ల నష్టాలు చవి చూసింది. 2019 డిసెంబర్తో ముగిసిన తొమ్మిది మాసాల కాలంలో రూ.928.90 కోట్ల నష్టాల పాలయ్యింది. ఇంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.629.66 కోట్ల నష్టాలు ప్రకటించింది. శుక్రవారం సెషన్లో బిఎస్ఇలో ఈ బ్యాంకు షేర్ 4.77 శాతం పతనమై రూ.18.95 వద్ద ముగిసింది. క్రితం డిసెంబర్ త్రైమాసికంలో బ్యాంకు మొత్తం ఆదాయం రూ.585.76 కోట్లకు పడిపోయింది. ఇంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.762.47 కోట్ల ఆదాయం నమోదు చేసింది. ఆదాయం తగ్గడం.. మరోవైపు నష్టాలు పెరగడంతో తాము కార్పొరేట్ రంగం నుంచి రిటైల్ క్లయింట్లపై దృష్టి పెట్టినట్లు ఆ బ్యాంకు తెలిపింది.