Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ ఐటీసీ భారత మార్కెట్లోకి రూబీ చాక్లెట్ సమ్మిళిత 'ఫాబెల్లె' చాక్లెట్లను అందుబాటులోకి తెచ్చింది. ఫాబెల్లెలో చాకో డెక్ మిల్క్, రూబీ చాక్లెట్ ఫ్లేవర్లను మార్కెట్లోకి ఆవిష్కరించినట్టు సంస్థ తెలిపింది. రూబీ చాక్లెట్తో భారత్లో తొలిసారి లగ్జరీ చాక్లెట్ వాణిజ్య మార్కెట్లోకి అడుగుపెట్టినట్లయ్యిందని పేర్కొంది. వినియోగదారులకు అత్యంత ప్రత్యేకమైన చాక్లెట్ అనుభూతిని అందించాలన్న లక్ష్యంతో ఫాబెల్లను అందుబాటులోకి తెచ్చామని ఆ కంపెనీ చాక్లెట్స్ విభాగం సీవోఓ అనూజ్ రస్తోగి పేర్కొన్నారు. చాకో డెక్ మిల్క్ 55 గ్రాముల ధర రూ.85గాను, రూబీ చాక్లెట్ (121.5 గ్రాముల) ధరను రూ.200గా నిర్ణయించామని సంస్థ తెలిపింది.