Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.9000 కోట్ల నిధుల సమీకరణే లక్ష్యం
ముంబయి: భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) అనుబంధ క్రెడిట్ కార్డ్ విభాగమైన ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ మార్చి2న పబ్లిక్ ఇష్యూకు (ఐపివో)కు రానుంది. ఎస్బీఐ కార్డ్స్లో ఎస్బీఐకి 76 శాతం వాటా ఉంది. కార్లే గ్రూపునకు ఈ సంస్థలో 24 శాతం వాటా ఉంది. క్రెడిట్ కార్డు మార్కెట్లో ఈ సంస్థక18 శాతం వాటాతో రెండో అతిపెద్ద క్రెడిట్ కార్డు జారీ సంస్థగా నిలిచింది. ఐపీఓ దరఖాస్తులను మార్చి 2-5 వరకు స్వీకరిస్తారు. మార్చి 13న డీమాట్ అకౌంట్లో షేర్లు క్రెడిట్ అవుతాయి. నిబంధనలకు అనుగుణంగా బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో ఈ షేర్లు మార్చి 16న లిస్టింగ్ కానుంది. ఎస్బీఐ రూ.500 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. 13.05 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ విధానంలో కేటాయిం చనుంది. ఈ ఇష్యూ ద్వారా మొత్తంగా రూ.9000 కోట్ల నిధులను సమీకరించనుంది. ఈ ఇష్యూకు కోటక్ మహీంద్రా క్యాపిటల్, యాక్సిస్ క్యాపిటల్, బోఫా సెక్యూరిటీస్, హెచ్ఎస్బిసి, నొమురా, ఎస్బిఐ క్యాపిటల్ మార్కెట్స్ ఫండ్ మేనేజర్స్గా వ్యవహారించనున్నాయి. మార్కెట్లో మంచి నైపుణ్యం వద్ధితో కూడిన లాభాలు ఆర్జించిన సంస్థగా ఎస్బీఐ కార్డుకు మంచి గుర్తింపు ఉంది. బ్రాండ్ ఇమేజ్తో పాటు బలమైన ప్రమోటర్ మద్దతు ఉంది. వివిధ రకాల పోర్ట్పోలియోల్లో క్రెడిట్ కార్డ్లను ఆఫర్ చేయగలగడం, సమర్థవంతమైన రికవరీ, డేటాను అనలైటికల్గా విశ్లేషణ చేయగల సామర్థ్యం, అధునాతన, స్కేలబుల్ టెక్నాలజీతో కూడిన మౌలిక సదుపాయాలు తదితర కీలక బలాలు కలిగి ఉంది. ఎస్బీఐ క్రెడిడ్ కార్డ్స్ వచ్చే ఐదేండ్లలో 2.5 రెట్లు వద్ధి చెందాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2015 నుంచి 2019 వరకు ప్రతీ ఏడాది 32 శాతం చొప్పున సగటు వద్ధితో రూ.6 లక్షల కోట్లకు చేరింది. 2024 నాటికి ఈ లావాదేవీల విలువను రూ.15 లక్ష కోట్లకు చేర్చాలని ఎస్బీఐ నిర్దేశించుకుంది.