Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 కోట్ల ఆదాయాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు వర్ధమాన్ (మహిళా) సహకార అర్బన్ బ్యాంక్ చైర్మెన్ శాంతిలాల్ దాగా తెలిపారు. బ్యాంక్ జనరల్ బాడీ సమావేశం గురువారం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా బ్యాంక్కు సంబంధించిన 2020-21 వార్షిక బడ్జెట్నకు వాటాదారులు సమ్మతి తెలిపారు. అనంతరంగా శాంతిలాల్ దాగా మాట్లాడుతూ పెరుగుతున్న బ్యాంక్ అవసరాల కోసం తాము అదనపు మూలధనాన్ని సమీకరించాలని నిర్ణయించామన్నారు. ఇందుకోసం అదనంగా తాజా షేర్లను జారీ చేయనున్నామని తెలిపారు. ఈ నెల 24 నుంచి మార్చి నెలాఖరు వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ పనితీరు మెరుగ్గా ఉందని అన్నారు. బ్యాంక్ వ్యాపారం ఇప్పటికే రూ.700 కోట్లను దాటేసిందని తెలిపారు. బ్యాంక్ సీఆర్ఏఆర్ 16 శాతానికి చేరిందని వివరించారు. నిబంధన స్థాయి కంటే కూడా ఎక్కువన్నారు.