Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కరోనా వైరస్ నేపథ్యంలో అనేక సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటినుంచి పనిచేసే సదుపాయాన్ని కల్పిస్తున్న క్రమంలోనే ఎస్బీఐ లైఫ్ కూ డా అదే బాటలో నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగుల సంక్షేమాన్ని దష్టిలో పెట్టుకొని ఇంటి నుంచి పనిచేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. కార్యాలయాల్లో పరిశుభ్రత, ఉద్యోగులు, కస్టమర్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ ఎండి సంజీవ్ నాతియాల్ తమ ఉద్యోగులకు రాసిన ఈమెయిల్ సందేశాల్లో తెలిపారు.