Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-2020లో 0.4 శాతమే వృద్ధి..!
- పెట్టుబడులు పడిపోవచ్చు...ఉద్యోగాలుడొచ్చు: మూడీస్ విశ్లేషణ
న్యూఢిల్లీ : కరోనా వైరస్ ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో సునామీని సృష్టించనున్నదని అంతర్జాతీయ రేటింగ్ ఎజెన్సీ మూడీస్ విశ్లేషించింది. ప్రభుత్వాలు తక్షణమే స్పందించకుంటే ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా నాశనం అయ్యే ప్రమాదం ఉందని మంగళవారం ఓ రిపోర్టులో హెచ్చరించింది. ఈ వైరస్ ఇప్పటికే చైనాతో పాటు ఇతర ఆసియన్ దేశాలను ముంచేసిందనీ, కొన్ని వారాల క్రితం యూరప్, అమెరికాలను తాకిందని పేర్కొంది. దాదాపుగా అన్ని నిత్యావసర రహిత వ్యాపారాలన్నీ మూతపడ్డాయని తెలిపింది. అనుహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామాలు ఆర్థిక వ్యవస్థలను ఒత్తిడికి గురి చేస్తున్నాయని తెలిపింది. అమెరికాలో చోటు చేసుకున్న నవంబర్ 11 నాటి తీవ్రవాద దాడులు ఒక్కటి, రెండు రోజులు మాత్రమే ప్రభావితం చేశాయి. ఆ సమయంలో విమానయాన రంగం మినహా అన్ని వ్యాపారాలు యథాతథంగా నడిచాయని మూడీస్ అనలిస్టు, చీఫ్ ఎకనామిస్టు మార్క్ జండి పేర్కొన్నారు. కాని ప్రస్తుత పరిస్థితి క్లిష్టంగా ఉందన్నారు. ఉద్యోగుల కోత ఉండొచ్చనీ, వ్యాపార పెట్టుబడులు పడిపోనున్నాయన్నారు. వడ్డీ రేట్లు జీరో శాతానికి తగ్గొచ్చన్నారు. కుటుంబాలకు, వ్యాపారులకు ప్రత్యేక ఆర్థిక మద్దతును అందించాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా వైరస్ రాక ముందు 2020కి గాను ప్రపంచ వృద్ధి రేటు 2.6 శాతంగా ఉండొచ్చని మూడీస్ అంచనా వేసింది. తాజాగా ఈ వృద్ధి రేటు అంచనాలను ఏకంగా 0.4 శాతానికి కోత పెట్టింది. రవాణ, వాణిజ్యం తదితర అన్ని వ్యాపారాలు మూత పడటంతో వృద్ధి రేటు పడిపోనుందని పేర్కొంది. ఆర్ధిక సునామీని ఎదుర్కొవడానికి చాలా ఆర్ధిక ప్రణాళికలు అవసరం అవుతాయని సూచించింది.