Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-జీడీపీలో 40శాతానికి సమానం
- ద్రవ్యలోటుకు ఏడు రెట్లు
ముంబయి : కరోనా వైరస్ దెబ్బకు స్టాక్మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. సోమవారం ఒక్కరోజే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ రికార్డు స్థాయిలో నష్టపోయిన సంగ తి తెలిసిందే. మదుపర్ల సొమ్ము రూ.14.22లక్షల కోట్లు ఆవిరైందని మార్కెట్ నిపుణులు వెల్లడించారు. మార్కెట్లో సంపద నష్టాన్ని భారత ఆర్థిక వ్యవస్థపై తప్ప క ప్రభావం చూపుతుందని వారు అన్నారు. ఈ సంపద నష్టం భారత ఆర్థిక వ్యవ స్థలోని కీలక అంశాలతో పోల్చిచూడగా...అది ఇలా ఉంది. నష్టపోయిన మదుపర్ల సొమ్ము రూ.14.22 లక్షల కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019) దేశ జీడీపీలో 40శాతం వాటాకు సమానమని నిపుణులు విశ్లేషించారు. బీఎస్ఈ లిస్టెడ్ షేర్ల విలువ డిసెంబరు31, 2019నాటికి 155.53లక్షల కోట్లు ఉంటే, మార్చి 24, 2020నాటికి ఆ షేర్ల విలువ 103.69లక్షల కోట్లకు పడిపోయిందన్న విషయం వారు గుర్తుచేశారు. గత 44రోజుల్లో సుమారుగా రూ.58లక్షల కోట్ల నష్టం వాటి ల్లింది. స్టాక్మార్కెట్లకు జరిగిన ఈ నష్టం, మనదేశ ద్రవ్యలోటు (కేంద్రం చెప్పినదా న్నిబట్టి) రూ.7.67లక్షల కోట్లకు ఏడురెట్లు ఉంది. సోమవారం ఒక్కరోజే బీఎస్ఈ మార్కెట్ నుంచి ఆవిరైన సంపద రూ.14.22లక్షల కోట్లు. ఇది అల్జీరియా దేశ స్థూల దేశీయోత్పత్తి కన్నా ఎక్కువ. నిఫ్టీసైతం రికార్డుస్థాయిలో పతనమైంది. ఒక్క రోజులో 1135 పాయింట్లు కోల్పోయింది. స్టాక్మార్కెట్లు ఈవిధంగా పతనం కావ డానికి ప్రధాన కారణం ఆర్థికమాంద్యం, కరోనా కేసులు పెరగటమే. ఇప్పటికే అనే క రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించటంతో వర్తక, వాణిజ్య కార్యకలాపాలన్నీ స్తంభించి పోయాయి. 2008 ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు మార్కెట్లు ఇలాగే రికార్డుస్థాయిలో పతనమయ్యాయి. 200 సెషన్లలో మార్కెట్లలో సంపద 66శాతం నష్టపోయింది.