Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-సెన్సెక్స్ 1411 పాయింట్లు పరుగు
ముంబయి : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ ఉత్సాహంలో భారత మార్కెట్లు భారీగా పెరిగాయి. గురువారం బీఎస్ఈ సెన్సెక్స్ 1411 పాయింట్లు పెరిగి 29,947కు చేరింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 324 పాయింట్లు పెరిగి 8,641 వద్ద ముగిసింది. మార్చి డెరివేటివ్ సిరీస్ చివరి రోజు సైతం మార్కెట్లు పెరగడం విశేషం. దీంతో వరుసగా మూడు రోజులు మార్కెట్లు లాభపడినట్టయింది. ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రయివేట్ బ్యాంక్స్ 8.3 శాతం, రియల్టీ 7.3 శాతం పెరిగాయి. ఎఫ్ఎంసీజీ, ఆటో, ఐటీ సూచీలు 5-2 శాతం వరకు రాణించాయి. డెరివేటివ్ కౌంటర్లలో బంధన్ బ్యాంక్ 42 శాతం దూసుకెళ్లగా.. అశోక్ లేలాండ్, మ్యాక్స్ ఫైనాన్స్, పిరమల్, మహానగర్ గ్యాస్, శ్రీరామ్ ట్రాన్స్, భారత్ ఫోర్జ్, డీఎల్ఎఫ్, నౌకరీ 29-13 శాతం మధ్య జంప్చేశాయి. బుధవారం సెషన్లో విదేశీ సంస్థాగత మదుపర్లు రూ. 1893 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.