Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-కరోనాతో జీడీపీ తగ్గొచ్చు
న్యూఢిల్లీ: లాక్డౌన్ వల్ల భారత ఆర్థిక వ్యవస్థ దాదాపుగా 75 శాతం స్థంభించిందని ఓ రిపోర్టులో వెల్లడైంది. కరోనా వల్ల భారత్ ఆర్థిక సంవత్సరం 2020-21లో విత్త లోటుతో పాటు అనేక ఇబ్బందులను ఎదుర్కొనుందని పేర్కొంది. పన్ను వసూళ్లు పడిపోనున్నాయని తెలిపింది. జీడీపీలో విత్తలోటు పెరగనుందని నోమురా ఇండియా చీఫ్ ఎకనామిస్టు, ఎండి సోనల్ వర్మా పేర్కొన్నారు. లాక్డౌన్ వల్ల ఏడాదికేడాదితో పోల్చిలే 2020-21 తొలి త్రైమాసికం జీడీపీలో 12.2 శాతం తగ్గుదల చోటు చేసుకోవచ్చని మోతిలాల్ ఓస్వాల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషనల్ హెడ్ గౌతమ్ దుగ్గడ్ పేర్కొన్నారు. వరుసగా రెండు త్రైమాసికాల్లో వృద్ధి రేటు పడిపోనుందన్నారు. వచ్చే మూడు నెలలు అనేక రంగాలు ఒత్తిడిలో ఉంటాయని కేర్ రేటింగ్స్ చీఫ్ ఎకనామిస్టు మదన్ సబ్నవిస్ అన్నారు. ఉత్పత్తి పడిపోయి.. ఉద్యోగాలు ఊడిపోవచ్చని హెచ్చరించారు.