Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : టెలికం కంపెనీ వొడాఫోన్ ఇండియాలో 5 శాతం వాటా కొనుగోలుకు టెక్ దిగ్గజం గూగుల్ ఆసక్తి కనబరుస్తోందని సమాచారం. వొడాఫోన్ ఇండియాలో గూగుల్ 5 శాతం వాటా కొనుగోలు చేయనుందని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. ఈ ఒప్పందం రూ వేలాది కోట్ల నష్టాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న వొడాఫోన్కు భారీ ఊరట కలిగే అవకాశం ఉంది. ఈ ఒప్పందం ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నందున ఒప్పందంలో మార్పులు చోటుచేసుకోవచ్చని తెలిపింది. రిలయన్స్ జియోలో ఫేస్బుక్ పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో వొడాఫోన్ ఇండియాలో వాటా కొనుగోలుకు గూగుల్ సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం.