Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లాక్డౌన్తో జీడీపీ(-)10% క్షీణత: ఆర్ధిక శాఖ మాజీ కార్యదర్శి
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీ అసలు విలువ రూ.1.4-1.4 లక్షల కోట్లుగానే ఉంటుందని ఆర్ధిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ అన్నారు. ఇది జీడీపీలో కేవలం 0.7 శాతమేనని తన బ్లాగ్లో విశ్లేషించారు. 2019-20లోనూ దేశ జీడీపీ 4 శాతానికి పరిమితమై 11 ఏండ్ల కనిష్ట స్థాయిని చవి చూసిందని గుర్తు చేశారు. మోడీ సర్కార్ ప్రకటించిన ప్యాకేజీపై అనేక రేటింగ్ ఎజెన్సీ నిపుణులు కూడా పెదవి విరిచిన విషయం తెలిసిందే. ఆ ప్యాకేజీలో అసలు పస లేదని, ఆర్ధిక వ్యవస్థను కాపాడలేవని విమర్శించారు. లాక్డౌన్ వల్ల భారత ఆర్ధిక వ్యవహారాలు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు అమాంతం పడిపోనుందని గార్గ్ పేర్కొన్నారు. గత 40 ఏండ్లలో ఎప్పుడూ లేని విధంగా జీడీపీ ఏకంగా మైనస్ 10 శాతానికి నమోదు చేసే అవకాశాలున్నాయని విశ్లేషించారు.