Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : లాక్డౌన్ వల్ల ప్రజల ఆదాయం పడిపోవడంతో ఆ ప్రభావం బీమా కంపెనీలపై కూడా పడుతోంది. ప్రస్తుత ఏడాది మే నాటికి జీవిత బీమా ప్రీమియం వసూళ్లలో 27.9 శాతం తగ్గి రూ.20,467 కోట్లకు తగ్గింది. 2019 ఇదే కాలంలో ఈ ప్రీమియం వసూళ్లలో ఏకంగా 41.1 శాతం వృద్ధి చోటు చేసుకుందని కేర్ రేటింగ్స్ ఓ రిపోర్టులో వెల్లడించింది. ఇదే సమయంలో ప్రయివేటు బీమా కంపెనీల తొలి ఏడాది బీమా వసూళ్లలో 46.9 శాతం పెరుగుదల ఉండగా.. 2020 మే నాటికి వీటి వసూళ్లలో 30.7 శాతం తగ్గుదల నమోదైనట్లు వెల్లడించింది. 2020 ఏప్రిల్, మే మాసాల్లో ఎల్ఐసీ మాత్రం 1.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2020 మే నాటికి ఈ పరిశ్రమ ప్రతికూల వృద్ధిని చవి చూసినట్టు కేర్ రేటింగ్స్ పేర్కొంది.