Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత్లో గూగుల్ పే యాప్ను ఆర్బిఐ నిషేధిస్తుందంటూ సోషల్ మీడియాలో వస్తోన్న పుకార్లపై నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పిసిఐ) స్పందించింది. గూగుల్ పే యాప్పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఈ యాప్ చట్టపరిధిలోనే ఉండి పని చేస్తుందని పేర్కొంది. తమ యాప్ యుపిఐ ద్వారా చెల్లింపుల కోసం బ్యాంకులకు టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్గా వ్యవహరిస్తుందని గూగుల్ పే తెలిపింది. ప్రతీ లావాదేవి పూర్తిగా సురక్షితమేనని పేర్కొంది.