Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్ఫుత్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ఆయన మరణంతో బాలీవుడ్లో నెపోటిజం (బంధుప్రీతి)పై పెద్ద దుమారమే రేగింది. వారసులుగా వచ్చి బాలీవుడ్లో రాణిస్తున్న ప్రతి ఒక్కరినీ టార్గెట్ చేస్తూ నెటిజన్లు నెపోటిజంపై తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. ఓ పక్క ప్రతిభగల నటుడు సుశాంత్ మరణం, మరో పక్క నెపోటిజంపై ప్రముఖుల దగ్గర్నుంచి సామాన్యుల వరకు నిరసన జ్వాలలు, సుశాంత్పై ప్రజల్లో పెరిగిన సింపతి నేపథ్యంలో విడుదలైన సుశాంత్ చివరి సినిమా 'దిల్ బేచారా' అఖండ విజయం సాధించింది. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రిలీజైన ఈ చిత్రాన్ని కేవలం 24 గంటల్లో తొమ్మిదిన్నర కోట్ల మంది వీక్షించారు. ఓర్మ్యాక్స్ మీడియా కథనం ప్రకారం, ఈ చిత్రానికి విశేష ప్రేక్షకాదరణతోపాటు విమర్శకుల ప్రశంసలు సైతం లభించాయి. అలాగే 10/ 10 ఐఎండీబీ రేటింగ్ లభించడంతో ఓ రికార్డ్ని క్రియేట్ చేసింది. అలాగే 24 గంటల్లో తొమ్మిదిన్నర కోట్ల మంది వీక్షించడం కూడా రికార్డే కావడం మరో విశేషం. ఇంటర్నేషనల్ స్థాయిలో 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' వెబ్ సీరిస్ స్థాయిలో ఈ చిత్రం వీక్షికుల సంఖ్యని రాబట్టింది. అంతేకాదు ఇదే సినిమా థియేటర్లలో రిలీజ్ అయి ఉంటే, కచ్చితంగా 1000 కోట్ల రూపాయలను రాబట్టేది. అయితే సుశాంత్ గౌరవార్థం ఈ చిత్రాన్ని దర్శక, నిర్మాతలు డిస్నీ హాట్ స్టార్ ప్లస్లో అందరూ ఉచితంగా చూసేలా ఏర్పాటు చేశారు.