Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'2020 సంవత్సరం ఎన్నో కష్టాలు తెచ్చి పెట్టింది. కరోనా వల్ల అనుక్షణం భయాందోళనలతో జీవిస్తున్నాం. కాలం నేర్పిన పాఠాలు ప్రతి ఒక్కరూ గ్రహించాలి' అని అంటోంది కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్. పలు తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న రకుల్ సైతం కరోనా లాక్డౌన్ వల్ల గత నాలుగు నెలలుగా ఇంటికే పరిమితమైంది. షఉటింగ్లు లేకపోవడంతో ఇష్టమైన పనులతో కాలక్షేపం చేస్తున్నప్పటికీ కరోనా భయం వెంటాడుతూనే ఉందని చెబుతోంది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ, 'ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరినీ కరోనా కష్టాల్లోకి నెట్టేసింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఇబ్బందులతోనే కొనసాగింది. నిత్యం భయాందోళనలతో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కాలం నేర్పిన పాఠాలను ఇప్పటికీ మనం గ్రహించకపోతే భవిష్యత్లోనూ ఇంత కన్న దారుణమైన పరిస్థితులను చవి చూడాల్సి వస్తుంది. సరిహద్దుల్లో సైనికులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడుతున్నారు. వారితో పోలిస్తే మనం సురక్షితంగా ఉన్నా స్వీయ రక్షణ పాటించి కరోనాను ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నాలను తప్పకుండా చేయాలి' అని చెప్పింది.