Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమిళ సూపర్స్టార్ అజిత్ తొలిసారి ఓ పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న 'వలిమై' చిత్రంలో అజిత్ నటిస్తున్న విషయం విదితమే. అయితే ఈ చిత్రాన్ని నిర్మాత బోనీకపూర్ పాన్ ఇండియా సినిమాగా తీసుకురావాలనే యోచనలో ఉన్నారని సమాచారం. తమిళంతోపాటు తెలుగు, హిందీ భాషల్లోనూ దీన్ని నిర్మించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారట. పవర్ఫుల్ పోలీస్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టాలీవుడ్ యువ కథానాయకుడు కార్తీకేయ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అలాగే ఇందులో అజిత్ సరసన బాలీవుడ్ కథానాయిక హూమా ఖురేషీ మెరవబోతున్నారు. ఇప్పటికే 40 శాతం పూర్తయిన ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.