Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అల వైకుంఠపురం'లో వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమా 'పుష్ప'లో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కొరటాల శివ కాంబినేషన్లో కూడా ఓ పాన్ ఇండియా సినిమా చేసేందుకు అల్లు అర్జున్ గ్రీన్సిగల్ ఇచ్చారు. యువ సుధ ఆర్ట్స్ బ్యానర్పై సుధాకర్ మిక్కిలినేని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. మరో అగ్ర నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగస్వామిగా ఉండనుంది. జీఏ2 పిక్చర్స్ సారథ్యంలో అల్లుఅర్జున్ మిత్రులు శాండీ, స్వాతి, నట్టి ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు. 'స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ తన స్నేహితుల్ని, బంధువుల్ని, సన్నిహితులను తన సినిమాల నిర్మాణంలో భాగస్వాములను చేస్తుంటారు. 'రేసుగుర్రం', 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా', 'పుష్ప' సినిమాల నిర్మాణంలోనూ ఆయన బంధువులు భాగస్వాములుగా ఉన్నారు. మరోసారి అదే తరహాలో తన మిత్రులు శాండీ, స్వాతి, నట్టిలకు ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరించేందుకు అవకాశం ఇచ్చారు. అలాగే డైరెక్టర్ కొరటాల శివకి సన్నిహితుడు, స్నేహితుడైన మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని యువ సుధ ఆర్ట్స్ బ్యానర్పై నిర్మించడం విశేషం.
అటు డైరెక్టర్ కొరటాల శివ ఇప్పటికే పలువురు స్టార్ హీరోలతో పని చేసి సూపర్ హిట్లు కొట్టారు. ఇటు స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ కూడా పలువురు ప్రముఖ దర్సకులతో పని చేసి బ్లాక్బస్టర్ హిట్స్ సొంతం చేసుకున్నారు. అలాంటి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా సెట్ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ పై అటు అల్లు అర్జున్ అభిమానుల్లో, ఇటు సాధరణ ప్రేక్షకులుల్లోనూ భారీగా అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా రిలీజ్ అవ్వబోతోంది' అని చిత్ర బృందం తెలిపింది.
ఆ పేద రైతు వల్లే ఈ స్థాయిలో ఉన్నాం : అల్లు అర్జున్
అలనాటి మేటి హాస్య నటుల్లో అల్లు రామలింగయ్యది ఓ ప్రత్యేక స్థానం. ఎన్నో వందల సినిమాల్లో తనదైన విలక్షణ నటనతో వెండితెరపై చెరగని ముద్ర వేసిన నటుడు. శుక్రవారం (జూలై 31) ఆయన వర్థంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయన్ని గుర్తు చేసుకున్నారు. వీరిలో అల్లు అర్జున్ కూడా ఉన్నారు. తాతయ్య మీద ఉన్న అభిమానం, గౌరవాన్ని చాటుకోవడంతోపాటు ఆయన స్ఫూర్తివంతమైన ప్రయాణం గురించి అల్లుఅర్జున్ భావోద్వేగభరిత ట్వీట్ పెట్టారు. 'ఇదే రోజు ఆయన మమ్మల్ని విడిచి పెట్టి వెళ్లిపోయారు. ఆ రోజు నాకింకా గుర్తుంది. ఆరోజు కంటే ఆయనేంటో, ఆయన గొప్పతనమేంటో ఈరోజు నాకు ఇంకా బాగా తెలుసు. నేను జీవితంలో ఎదుర్కొన్న అనుభవాల కంటే, ఆయన ఎఫర్ట్స్, ప్రయాణం, ఆయన ఎదుర్కొన్న సమస్యలకు నేను బాగా కనెక్ట్ అయ్యాను. సినిమాలపై ఓ పేద రైతుకి ఉన్న ప్యాషన్ వల్లే ఈరోజు మేం ఈ స్థాయిలో ఉన్నాం' అని అల్లుఅర్జున్ ట్వీట్లో పేర్కొన్నారు.