Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాని కథానాయకుడిగా నటించిన 'జెర్సీ' చిత్రం ఓ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. అందరూ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఈ చిత్రం అర్హత సాధించింది. నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం 'జెర్సీ'.
తెలుగునాట ఘన విజయం సాధించడంతో పాటు ప్రశంసలూ అందుకుందీ చిత్రం. సంగీత దర్శకుడు అనిరుద్ ఈ చిత్రానికి తన సంగీతంతో ప్రాణం పోశారు. సాను జాన్ వర్గీస్ ఛాయాగ్రహణ దర్శకత్వం ఈ చిత్రానికి మరో ఆకర్షణగా నిలిచింది. పరాజితుడైన ఓ క్రికెటర్ తన ఆటను మెరుగు పరచుకుని ఏ విధంగా గెలుపు సాధించాడు?, జీవితంలో అతను ఒడి, ఆటలో గెలిచిన తీరుతో హద్యంగా రూపొందిందీ చిత్రం. భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఈ చిత్రం ఎంపికవటం, ఈ ఏడాది ఆగస్టు 9 నుంచి 15 వరకు జరిగే ఈ చిత్రోత్సవంలో ఈ చిత్రం ప్రదర్శితం కానుండటం, ఈ విషయాన్ని మీడియాతో పంచుకోవటం తమ కెంతో సంతోషాన్ని కలిగిస్తోందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ శుభ సమయంలో కెనడాలో ఈ వేడుక జరుగనుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలోనే షాహిద్ కపూర్తో ఈ చిత్రం బాలీవుడ్లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే.