Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తండ్రి కమ్ముల శేషయ్య (89) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అన్ని కరోనా రక్షణ నిబంధనలను పాటిస్తూ శనివారం సాయంత్రం బన్సీలాల్ పేట స్శశాన వాటికలో ఆయన అంత్యక్రియలను జరిపినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. శేఖర్ కమ్ముల ప్రస్తుతం నాగచైతన్య, సాయిపల్లవి జంటగా 'లవ్స్టోరీ' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం విదితమే.