Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇండియన్ ఎయిర్ఫోర్స్ తొలి మహిళా ఫైలెట్ గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ 'గుంజన్ సక్సేనా : ది కార్గిల్ గర్ల్'. శరణ్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ గుంజన్ సక్సేనాగా నటించారు. ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్ర ట్రైలర్ను చిత్ర బృందం శనివారం సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసింది.
'మీరు ఎయిర్ఫోర్స్లో చేరాలనుకుంటే మీరొక సైనికుడు అవ్వాలి. లేదంటే ఇంటికి వెళ్ళి వంట చేసుకోండి' అనే డైలాగ్తో ఆరంభమైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. చిన్నప్పట్నుంచి ఫైలెట్ కావాలనుకున్న గుంజన్ సక్సేనా ఎలాంటి ప్రయత్నాలు చేసింది?, పైలెట్ శిక్షణలో ఆమెకు ఎదురైన అనుభవాలు, అవమానాలు ఏంటి?, వాటన్నింటినీ అధిగమించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో తొలి మహిళా ఫైలెట్గా ఎలా నిలిచిందన్న వాస్తవ సంఘటనలను భావోద్వేగ భరితంగా దర్శకుడు తెరకెక్కించారు. అలాగే 'నాన్న మిమ్మల్ని ఎప్పటికీ ఓడిపోనివ్వను' అంటూ గుంజన్ పాత్రధారిగా జాన్వీ చెప్పిన సంభాషణలు చాలా ఎమోషనల్గా ఉన్నాయి.
ఏప్రిల్లో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా లాక్డౌన్ వల్ల వాయదా పడింది. దీంతో ఈ చిత్రాన్ని ఓటీటీ ఫ్లాట్ఫామ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శక, నిర్మాతలు నిర్ణయం భావించారు.ఈ ప్రయత్నంలో భాగంగా ఈ చిత్రాన్ని ఈనెల 12న ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ద్వారా విడుదల చేస్తున్నారు.