Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఎట్టకేలకు కరోనాని జయించి, సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఒక్క జయా బచ్చన్కి మినహా మిగిలిన అమితాబ్ కుటుంబ సభ్యులకు కరోనా పాటిజివ్ వచ్చిన విషయం విదితమే. ముంబయిలోని నానావతి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్రమంలో ఇటీవల ఐశ్వర్యరారు, ఆమె కూతురు ఆరాధ్యకు కోవిడ్-19 నెగటివ్ రావడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే బిగ్ బి అమితాబ్కి సైతం నెగటివ్ రావడంతో ఆయన కూడా ఆదివారం ఇంటికి చేరుకున్నారు. 77 ఏళ్ళ వయసులోనూ ధైర్యంతో కరోనాపై పోరాడి అమితాబ్ విజయం సాధించారు. ఈ విషయాన్ని ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు. అయితే తాను మాత్రం ఇంకా కరోనా నుంచి కోలుకోలేదని, మరికొంత సమయం ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం ఉందని ట్వీట్లో అభిషేక్ పేర్కొన్నారు.
'మా నాన్నకి తాజాగా చేసిన కోవిడ్ -19 పరీక్షలు నెగటివ్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ చేశారు. ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ కరోనా మహమ్మారి నుంచి ఆయన సురక్షితంగా బయట పడాలని ఆయన కోసం ప్రార్థించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదలు తెలియజేస్తున్నాను. దురదృష్టవశాత్తు నేను ఇంకా దాని నుంచి కోలుకోలేదు. మరికొంత కాలం నేను చికిత్స తీసుకోవాల్సి ఉంది. నాన్న మాదిరిగానే నేనూ కరోనాను జయించి మీ ముందుకు వస్తానని వాగ్దానం చేస్తున్నా' అని ట్వీట్లో అభిషేక్ తెలిపారు.