Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే తెలుగులో మరో బంపర్ ఆఫర్ని దక్కించుకుంది. స్టార్ కథానాయకుడు మహేష్బాబు సరసన వెండితెరపై మెరవబోతోందని సమాచారం. 'గీత గోవిందం' దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో మహేష్బాబు హీరోగా రూపొందుతున్న చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ చిత్రంలో మొదటి హీరోయిన్గా ఇప్పటికే కీర్తి సురేష్ని ఎంపిక చేసిన చిత్ర బృందం రెండో కథానాయికగా అనన్య పాండేని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అనన్య పాండే ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా 'ఫైటర్' (వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటిస్తుంది. ఇందులో విజరుదేవర కొండతో కథానాయికగా స్క్రీన్ని షేర్ చేసుకుంటోంది. ఏదిఏమైనా ఏకకాలంలో ఇద్దరు స్టార్ హీరోలతో సినిమాలను చేసే అవకాశం దక్కించుకున్న అనన్యని గోల్డెన్ గర్ల్గా నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.