Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం 'రౌద్రం రుధిరం రణం' వంటి భారీ మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్న రామ్చరణ్ తాజాగా ఓ ద్విభాషా చిత్రానికి గ్రీన్సిగల్ ఇచ్చినట్టు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోయే ఈ చిత్రానికి తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది.
కార్తీ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన చిత్రం 'ఖైదీ'. విడుదలకు సిద్ధంగా ఉన్న ఓ ఖైదీ జీవితంలో ఒక రాత్రి జరిగిన కథతో తెరకెక్కిన ఈ చిత్రం అటు తమిళంలోను, ఇటు తెలుగులోనూ మంచి విజయం సాధించింది. అలాగే కలెక్షన్ల పరంగానూ టాలీవుడ్, కోలీవుడ్ బాక్సాఫీస్ల వద్ద సత్తా చాటింది. విమర్శకుల ప్రశంసల్ని సైతం సొంతం చేసుకున్న ఈ చిత్రం ఇటీవల టొరంటో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శనకు కూడా అర్హత సాధించింది. ఈ చిత్రంతో దర్శకుడు లోకేష్ కనకరాజ్కి మంచి పేరుతోపాటు స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలూ వచ్చాయి.
అందులో భాగంగా ఆయన ప్రస్తుతం తమిళ అగ్ర కథానాయకుడు విజరుతో 'మాస్టర్' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కరోనా కట్టడి కోసం ప్రకటించిన లాక్డౌన్ కారణంగా ఈ చిత్ర విడుదల వాయిదా పడింది. అలాగే ప్రస్తుతం కరోనా మహమ్మారి విస్తృతంగా విజృంభిస్తున్న కారణంగానూ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేని పరిస్థితి ఏర్పడింది. అయితే గత కొన్ని రోజులుగా ఈ చిత్రాన్ని ఓటీటీ ఫ్లాట్ఫామ్ ద్వారా డైరెక్ట్గా రిలీజ్ చేస్తారనే వార్తలూ సోషల్మీడియాలో హల్చల్ చేశాయి. అయితే చిత్ర బృందం వాటిని ఖండించింది. ఇదిలా ఉంటే, రామ్చరణ్ ప్రస్తుతం ఎన్టీఆర్తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రీకరణ సైతం కరోనా లాక్డౌన్ వల్ల నిలిచిపోయింది. దీంతోపాటు దర్శకుడు రాజమౌళికి కరోనా పాజిటివ్ ఉండటంతో ఇప్పట్లో ఈ సినిమాకి సంబంధించి చిత్రీకరణ ఇప్పట్లో జరిగే ఛాన్స్ కనిపించడం లేదు.