Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఈ రోజుల్లో' ఫేమ్ మంగం, శశాంక్, అవంతిక హరి నల్వా, గాయత్రి అయ్యర్ హీరో, హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం 'ప్రణవం'. చరిత అండ్ గౌతమ్ ప్రొడక్షన్స్ పతాకంపై కుమార్ జి. దర్శత్వంలో తనూజ.ఎస్ నిర్మిస్తున్న చిత్రమిది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఓటీటీ ద్వారా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ, ''ఈ రోజుల్లో' చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీ మంగం హీరోగా ఈ చిత్రాన్ని నిర్మించాం. మరోమారు హీరోగా తానేంటో నిరూపించుకునేలా ఈ సినిమా ఉంటుంది. ఇక దర్శకుడు కుమార్కి ఇది తొలి సినిమా అయినప్పటికీ ప్రేక్షకుల ఆలోచనా విధానానికి తగ్గట్టుగా తెరకెక్కించారు. ప్రజెంట్ కొత్త కథలతో పోటీ పడి సినిమాలు చేస్తోన్న దర్శకుల లిస్ట్లో మా దర్శకుడు కుమార్ కూడా తప్పకుండా చేరతారనే నమ్మకంతో ఉన్నాం. కథకి తగ్గట్టుగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని చాలా రిచ్గా నిర్మించాం. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ బాగా కుదిరాయి. పద్మారావ్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే విడుదలై సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చాయి. చాలా కాలం తర్వాత ఇందులో ఆర్.పి.పట్నాయక్, ఉష కలిసి ఓ పాటను పాడటం విశేషం. అలాగే సునీత, అనురాగ్ కులకర్ణి పాడిన పాటలకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఓ వైవిధ్యమైన కథతో రూపొందించిన ఈ చిత్రాన్ని ఓటీటీ ద్వారా త్వరలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని చెప్పారు.
జెమిని సురేష్, నవీన, జబర్దస్త్ బాబి, దొరబాబు, సమీర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపి: మార్గల్ డేవిడ్, కొరియోగ్రాఫర్: అజరు, సంగీతం: పద్మనావ్ భరద్వాజ్, ఎడిటర్: సంతోష్, ఫైట్స్: దేవరాజ్, లిరిక్స్: కరుణ కుమార్, సిహెచ్ విజరుకుమార్, రామాంజనేయులు, కో- ప్రొడ్యూసర్స్: వైశాలి, అనుదీప్, దర్శకత్వం: కుమార్.జి.