Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం 'లక్ష్మీబాంబ్', 'షేర్షా', 'ఇందు కీ జవాని', 'భూల్ భలయ్యా 2' వంటి తదితర చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న క్రేజీ కథానాయిక కైరా అద్వానీ లేటెస్ట్గా మరో బంపర్ ఆఫర్ని సొంతం చేసుకుంది. ధర్మా ప్రొడక్షన్స్లో కరణ్జోహార్ నిర్మించబోయే రొమాంటిక్ కామెడీ చిత్రంలో కైరాని కథానాయికగా ఎంపిక చేశారు. ఈచిత్రంలో వరుణ్ ధావన్కి జోడిగా ఆమె మెరవబోతున్నారు. ఈ చిత్రాన్ని 'గుడ్న్యూజ్' దర్శకుడు రాజ్ మెహతా తెరకెక్కించబోతున్నారు. ఇదిలా ఉంటే, టాలీవుడ్లోనూ కైరా మరో గోల్డెన్ ఆఫర్ని దక్కంచుకున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందబోయే పాన్ ఇండియా సినిమాలోనై కైరాని ఎంపిక చేశారని సమాచారం. పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో సాగే ఈ చిత్రానికి 'అయిననూ పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం.