Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈనెల 22న 65వ పుట్టినరోజు జరుపుకోబోయే చిరంజీవికి ఓ స్పెషల్ గిప్ట్ని అందించేందుకు ఆయన అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు. మెగాస్టార్ 65వ వసంతంలోకి అడుగిడుతున్న నేపథ్యాన్ని పురస్కరించుకుని ఆయన సీడీపీ (కామన్ బర్త్డే పిక్)ని దేశ వ్యాప్తంగా భిన్న రంగాలకు చెందిన 65 మంది ప్రముఖులు ఆవిష్కరించ బోతున్నారు. అయితే ఆ ప్రముఖులు ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. 50 రోజుల క్రితం నుంచే చిరు అభిమానులు సోషల్ మీడియాలో విస్తృతంగా పోస్టులు పెడుతూ హల్చల్ చేస్తున్నారు. మెగాస్టార్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' చిత్రంలో నటిస్తున్నారు. కోవిడ్-19 కారణంగా ఈ సినిమాకి సంబంధించి చిత్రీకరణ నిలిచిపోయింది. ఈ చిత్రంలో చిరు తనయుడు రామ్చరణ్ ఓ ప్రత్యేక పాత్రలో మెరవబోతున్నారనే వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. ఈ చిత్రంలో చిరు సరసన కాజల్ నటిస్తున్న విషయం విదితమే. గతంలో చిరు,కాజల్ 'ఖైదీ నెంబర్ 150'లో నటించారు.