Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీ కష్ణ క్రియేషన్స్ పతాకం పై ఆదా శర్మ హీరోయిన్గా నటిస్తున్న చిత్రం '?' (క్వశ్చన్ మార్క్). విప్రా దర్శకత్వంలో గౌరీ కష్ణ నిర్మాతగా, గౌరు ఘనా సమర్పణలో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ చిత్ర పోస్టర్ను శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'కరోనా వల్ల ప్రజలకు వినోదం కరువైంది. ఇలాంటి తరుణంలో మంచి వినోదంతో, మంచి మెసేజ్తో వస్తున్న '?' (క్వశ్చన్మార్క్) చిత్రం విజయం సాధించి దర్శక, నిర్మాతలకు, హీరోయిన్ ఆదాశర్మ, ఇతర యూనిట్ సభ్యులకు మంచి పేరు తీసుకురావాలి' అని అన్నారు. కథానాయిక ఆదాశర్మ మాట్లాడుతూ, 'కరోనా టైమ్లో చిత్రీకరణ స్టార్ట్ చేసి, పూర్తి చేయడమే కాకుండా విడుదలకు సిద్ధమవుతున్న ఫస్ట్ సినిమా మాదే కావడం ఆనందంగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. నా పాత్రకు నేనే డబ్బింగ్ చెబుతున్నాను. విప్రా పేరుతో ఇద్దరు దర్శకులు ఈ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అందరికీ మంచి పేరు తెస్తుంది' అని చెప్పారు. 'కరోనా టైమ్లో సినిమాని ప్రారంభించి చిత్రీకరణ పూర్తి చేశాం. కరోనా వల్ల ఎవ్వరూ ఇళ్ల నుంచి బయటకు రాని పరిస్థితిలో కూడా మా కథానాయిక ఆదాశర్మ ఎంతో సహకరించారు. మా దర్శకుల ప్లానింగ్ వల్లే సినిమాను అనుకున్న విధంగా తీయగలిగాం. మా సినిమా పోస్టర్ని తలసాని శ్రీనివాస్ యాదవ్గారు లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది' అని నిర్మాత గౌరికష్ణ అన్నారు. దర్శకులు విప్రా మాట్లాడుతూ, 'క్వశ్చన్ మార్క్ టైటిల్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా చూస్తే ఈ టైటిల్ యాప్ట్ అని అంటారు. అందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది' అని తెలిపారు.